News

కొత్తూరులో భారీగా నగదును స్వాధీనం


పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత కొత్త కరెన్సీ కోసం ప్రజలు నానా అవస్థలు పడుతుంటే కొందరు అక్రమార్కుల వద్ద భారీ మొత్తంలో కొత్తనోట్లు దొరుకుతుండటం ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, తాజాగా రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పాత నోట్ల మార్పిడి ముఠా నుంచి శనివారం పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో రూ.27లక్షల మేర కొత్త రూ.2వేల నోట్లు కాగా, మిగతా రూ.10లక్షల మేర రూ.10, రూ.20, రూ100 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠా నగదు మార్చుకొని వస్తుండగా పుత్తూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు నగదు లభ్యతపై ఆరా తీస్తున్నారు.